NTPC Pollution at Ramagundam

ఎన్.టి.పి.సి యాష్ ప్రభావిత నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపండి- ఎంపీ వెంకటేష్ నేత

NTPC సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న కుందన్ పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికై రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ తలపెట్టిన పాదయాత్రకు… పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మద్దతు ప్రకటిస్తూ ఈ రోజు ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి, N.T.P.C CMD శ్రీ గురుదీప్ సింగ్ ని కలిసి NTPC వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని.. అందువల్ల నిర్వాసిత గ్రామాల సురక్షిత ప్రాంతాలకు మార్చి సహకారం అందించాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత కోరగా, గురుదీప్ సింగ్ సానుకూలంగా స్పందించి త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ కార్యాలయం తెలిపింది.