తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల సమగ్ర మ్యాప్ అట్లాస్ ను ఆవిష్కరించిన బోయినపల్లి వినోద్ కుమార్

రాష్ట్రంలోని 33 జిల్లాలతో కూడిన సమగ్రమైన మ్యాప్ అట్లాస్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.

సోమవారం మంత్రుల నివాసంలో విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముద్రించిన ఈ మ్యాప్ ను కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించింది.

రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న ఏకైక మ్యాప్ ఇదేనని ఆయన అన్నారు.

ప్రజలు, అధికార యంత్రాంగానికి ఈ మ్యాప్ ఎంతో ఉపయోగకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.