Minister Koppula Eshwar Distributes Christmas Gift Packs

క్రైస్తవులకు గిఫ్ట్‌ ప్యాక్‌లు పంపిణీ మంత్రి కొప్పుల ఈశ్వర్

సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నరని తెలంగాణ సర్కార్‌ సర్వమతాలను గౌరవిస్తూ వాటికి సముచిత స్థానం కల్పిస్తున్నదని, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం SR గార్డెన్ లో క్రైస్తవులకు గిఫ్ట్‌ ప్యాక్‌ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ పాస్టర్లు కు పంపిణీ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్‌ సమన్యాయం చేస్తున్నారని.. ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూన్నారని అన్నారు. ఈనెల 21వ తేదీన హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో క్రైస్తవ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి కెసీఆర్ క్రిస్మస్ విందు ఇస్తారని
ఈశ్వర్ తెలిపారు.

క్రిస్మస్‌ వేడుకలను పేదలు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం గిఫ్ట్‌ ప్యాక్‌ లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్టుగానే రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకూ దుస్తులు అందిస్తున్నట్లు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో 4,000 కుటుంబాలకు అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీలు సుధారాణి, బాదినేని రాజేందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు, స్థానిక సర్పంచ్ శేఖర్ గారు, DWO అధికారి నరేష్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.