cropped cp.jpeg
Latest

సౌదీ అరేబియాలో బస్సు దుర్ఘటన 42 మంది భారతీయుల మృతి – మరణించిన వారిలో హైదరాబాద్‌ వాసులు

202511163577006

Saudi Arabia Bus Accident

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు సమాచారం. మృతి చెందిన వారిలో గణనీయ సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు వెల్లడైంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ముఫరహత్‌ ప్రాంతంలో జరిగింది. ఢీకొన్న వెంటనే మంటలు వేగంగా వ్యాపించడం వల్ల బస్సులోని ప్రయాణికులు బయటపడే అవకాశం లేకపోయింది. ప్రమాద సమయంలో ఎక్కువ మంది నిద్రలో ఉండటంతో పరిస్థితి ఇంకాస్త విషమించిందని స్థానిక వర్గాలు తెలిపాయి.

సమాచారం అందిన వెంటనే సౌదీ రక్షణ బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, సౌదీలోని భారత రాయబారి కార్యాలయం ఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. మరణించిన వారు, గాయపడిన వారి వివరాలను కుటుంబాలకు చేరవేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన పలువురు ఈ ప్రయాణంలో ఉన్నట్లు తెలిసి, వారు ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మక్కా–మదీనా యాత్రకు వెళ్లారని ప్రభుత్వం నిర్ధారించేందుకు పరిశీలనలు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలపై సౌదీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link