cropped cp.jpeg
whatsapp image 2025 12 13 at 1.52.19 pm (1)

Telangana News: ఓటెయ్యకపోతే నా డబ్బులు తిరిగివ్వండి ప్లీజ్‌

నార్కట్‌పల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచి అభ్యర్థి.. ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి వసూలు చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఔరవానిలో చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి బాలరాజు.. ఓటర్లకు డబ్బులు పంచాడు. కానీ.. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కల పరమేశ్‌ 450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. దీంతో బాలరాజు దేవుడి ఫొటో పట్టుకొని ‘‘మీరు నాకు ఓటు వేస్తే దేవుడి…

Read More
kr edited

800 ఏళ్ల రాయదండి చరిత్ర: ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది?

– ప్రముఖ గ్రామీణ రాజకీయ విశ్లేషకులు కునారపు రమేష్ (KR) ప్రత్యేక విశ్లేషణ పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలంలోని ఒక కుగ్రామం రాయదండి. సుమారు 800 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రాంతం, పూర్వకాలంలో రత్నాలను రాసులు పోసి అమ్మేవారికి ‘మండి’గా ఉండేదని, అందుకే దీనికి రాయదండి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఒకప్పుడు మావోయిస్టులకు, ఆ తర్వాత నేరాలకు అడ్డాగా ఉన్న ఈ గ్రామం, ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంతో విరాజిల్లుతోంది. రామగుండం నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ,…

Read More
whatsapp image 2025 12 09 at 8.22.06 pm

ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు ఓటు హక్కు వినియోగించుకోనున్న 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్,…

Read More
whatsapp image 2025 12 08 at 9.57.40 pm (1)

రేపటి నుంచి వైన్స్ బంద్

ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read More
whatsapp image 2025 12 08 at 3.52.54 pm (1)

గుమ్మడి నర్సయ్యను కలిసిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దంపతులు

ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నికైన ప్రముఖ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త గుమ్మడి నర్సయ్యను కారేపల్లి మండలంలోని టేకులగూడెంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దంపతులు కలిసారు. నర్సయ్య రాజకీయ జీవితచరిత్రపై నిర్మిస్తున్న బయోపిక్లో శివరాజ్కుమార్ నటించనుండగా శనివారం పాల్వంచలో సినిమా ప్రారంభ వేడుక జరగనుంది. ప్రజల మనిషిగా పేరొందిన గుమ్మడి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన తనకు తండ్రిలాంటి వారని శివన్న అన్నారు.

Read More
whatsapp image 2025 12 08 at 3.52.54 pm

ఆడపిల్ల పుడితే రూ.10,000.. ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చిత్రవిచిత్ర హామీలతో ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో ఓ అభ్యర్థి గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఆడపిల్ల పుడితే రూ.2వేలు, తీజ్ పండుగకు రూ.20వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు వంటి హామీలను ప్రటించారు.

Read More
whatsapp image 2025 12 08 at 3.52.53 pm (1)

సర్పంచుల విధులేంటో తెలుసా?

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం.. సర్పంచ్లు నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పష్టంగా నిర్వచించింది. సామూహిక మరుగుదొడ్ల ఏర్పాటు, బావుల మరమ్మతులు, పూడికతీత, జనన, మరణాలను నమోదు చేయాలి. వ్యాధుల నివారణకు చర్యలు, శ్మశానవాటికల నిర్వహణ, అనాథ శవాల దహన సంస్కారాలు నిర్వహించాలి. ధర్మశాలలు, అతిథి గృహాల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలి. మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతులు, వీధులు శుభ్రం చేయించడం, వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ వంటివి చూసుకోవాలి.

Read More
whatsapp image 2025 12 08 at 3.52.53 pm

సర్పంచ్ అభ్యర్థి ఆఫర్ హల్ చల్.. ఏకగ్రీవం విఫలం

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ఏకగ్రీవం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తానని ప్రకటించడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. రచ్చబండ సమావేశంలో ఇతర అభ్యర్థులు ఉపసంహరణకు అంగీకరించినా, అధికార పార్టీ అభ్యర్థి పల్లె దయాకర్ హాజరుకాకపోవడంతో ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఫలితంగా జయగిరిలో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది.

Read More
screenshot 2025 12 05 212415

CM Revanth Reddy Launches Major Development Initiatives in Narsampet

Telangana Chief Minister Revanth Reddy has embarked on a visit to Narsampet in the Warangal district, accompanied by Minister Ponguleti Srinivasa Reddy and Chief Minister’s Advisor Vem Narender Reddy. They received a warm welcome from local MLAs, leaders, and officials. During this visit, CM Reddy inaugurated a series of development projects amounting to a substantial…

Read More