cropped cp.jpeg
Latest
whatsapp image 2025 12 11 at 11.03.00 am (1)

అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక మూడు రోజులు మృతదేహంతో నివసించిన కుటుంబ సభ్యులు

ఇంటి యజమాని ఫిర్యాదుతో, స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు జరిపించిన పోలీసులు. హైదరాబాద్ – జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్‌నగర్ సమీపంలో ఉన్న ఎన్ఎల్‌బీనగర్ ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వామిదాస్(76) అనే వ్యక్తి. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే క్రమంలో, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని ఉద్యోగం మానేసిన స్వామిదాస్ చిన్న కూతురు సలోని. ఆరోగ్య పరిస్థితి విషమించి స్వామిదాస్…

Read More
whatsapp image 2025 12 11 at 11.03.04 am (1)

బిగ్ బ్రేకింగ్ న్యూస్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు మీద కేసు పెట్టినందుకు గచ్చిబౌలి ఎస్సైకి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్. ఇటీవలే శిఖా గోయల్ నుండి లా అండ్ ఆర్డర్ విభాగంలో “సురక్షిత్ హైదరాబాద్” అవార్డును అందుకున్న గచ్చిబౌలి ఎస్సై మొహమ్మద్ హబీబుల్లా ఖాన్. మంత్రి కొడుకు మీద కేసు పెట్టినందుకు వేకెన్సీ రిజర్వ్ పేరిట ఎస్సై మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌కు పనిష్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.

Read More
whatsapp image 2025 12 09 at 8.22.06 pm

ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు ఓటు హక్కు వినియోగించుకోనున్న 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్,…

Read More
whatsapp image 2025 12 08 at 9.57.42 pm (2)

యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా.. ? అకౌంట్లు ఖాళీ అవ్వచ్చు.. బీ అలర్ట్..!

యూపీఐ, మొబైల్ వాలెట్లు, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్స్తో క్షణాల్లో పనులు జరుగుతున్నాయి. అయితే, ఫైనాన్షియల్ టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. జాగ్రత్తగా లేకుంటే పర్సు ఖాళీ అవుతోంది. పాత వాటి గురించి అందరికీ తెలిసిపోవడంతో మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోచుకుంటున్నారు. ప్రజల ప్రవర్తనను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ ఇంజనీరింగ్ విధానాల ద్వారా మోసగిస్తున్నారు. ఫిషింగ్, నకిలీ మర్చంట్ యాప్లు, సిమ్ స్వాప్ వంటి మార్గాల్లో బ్యాంకు ఖాతాలను…

Read More
whatsapp image 2025 12 08 at 9.57.42 pm (1)

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా ప్రాంతం, సాకేత్ కాలనీలో 54 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట రత్నం మృతిచెందాడు. గుర్తుతెలియని హతకారులు గన్ మరియు కత్తులతో దాడి చేసి అతన్ని కిరాతకంగా హతమార్చినట్లు సమాచారం. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు హత్య వెనుక ఉన్న కారణాలు మరియు హతకారులను గుర్తించేందుకు…

Read More
whatsapp image 2025 12 08 at 9.57.41 pm

మేడారం జాతర బందోబస్త్ కి వచ్చే సిబ్బందికి తగిన వసతులు కల్పించాలి.

జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపిఎస్ మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు కోసం వచ్చేటువంటి అధికారులు మరియు సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అధికారులతో కలిసి వెంగలాపూర్ నుంచి మొదలుకొని బయ్యక్కపేట వరకు, అదేవిధంగా మేడారంలో వసతుల కోసం నిర్దేశించిన ప్రదేశాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఆయా ప్రదేశాలలో…

Read More
whatsapp image 2025 12 08 at 9.57.40 pm (1)

రేపటి నుంచి వైన్స్ బంద్

ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read More
whatsapp image 2025 12 08 at 9.57.40 pm

ముషీరాబాద్‌లో దారుణం: అనుమానంతో మేనమామ చేతిలో యువతి హతం

హైదరాబాద్‌ నగరంలోని ముషీరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాపూజీనగర్‌కు చెందిన పవిత్ర అనే యువతిని ఆమె మేనమామ ఉమాశంకర్ కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా విషాదాన్ని నెలకొల్పింది. పవిత్ర మేనత్త తెలిపిన వివరాల ప్రకారం, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉమాశంకర్‌ను పవిత్ర తండ్రే ఆశ్రయించాడు. వారిద్దరి మధ్య సన్నిహితత పెరిగి, భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే, కొంతకాలంగా పవిత్రపై ఉమాశంకర్‌కు అనుమానాలు పెరిగాయి. ఈ అనుమానంతోనే ఆమెను…

Read More
whatsapp image 2025 12 08 at 3.52.56 pm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన ఘటన

విద్యార్థిని స్కూల్‌కు పంపించట్లేదని ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు వారం రోజుల నుండి వెళ్లని నాలుగో తరగతి విద్యార్థి. ఉపాధ్యాయులు అడిగితే సమాధానం ఇవ్వని తల్లిదండ్రులు. దీంతో నిన్న బాలుడి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు. దీంతో సోమవారం నుండి తమ బాబుని స్కూల్‌కు పంపుతామని తెలిపిన తల్లిదండ్రులు.

Read More
oplus 131072

వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల, పోలీసుల అత్యుత్సాహం

కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గం వర్ధన్నపేటలోని పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకొని డ్రైవర్‌ను వేధింపులకు గురి చేసిన పోలీసులు. గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం అయిపోయే వరకు బీఆర్ఎస్ ప్రచార రథం తిరగకూడదని పోలీసుల హుకుం. పర్వతగిరి మండలం మాల్యా తండాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ వ్యవసాయ మార్కెట్‌లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. జాడపత్తలేని ఎన్నికల అధికారులు.

Read More