Green India Challenge: DJ Tillu crew planted saplings

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన డీజే టిల్లు మూవీ హీరో సిద్దు జొన్నలగడ్డ,హీరోయిన్ నేహశెట్టి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా ప్రశాసన్ నగర్ GHMC పార్క్ లో మొక్కలు నాటిన సినీ నటుడు సిద్దు, నటి నేహశెట్టి….

ఈ సందర్భంగా సిద్దు, నేహశెట్టి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ బాగస్వామ్యులను చేస్తున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.అనంతరం సిద్దు తన స్నేహితులు ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక,మీనాక్షి చౌదరికి చాలెంజ్ విసరగా నేహశెట్టి మరోముగ్గురు డైరెక్టర్ విమల్ కృష్ణ, నిర్మాత నాగవంశీ, నటుడు ప్రిన్స్ కి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది.