రెండు కోట్ల ఆధార్ ఐడీలు డీయాక్టివేట్
ఆధార్ డేటాబేస్లోని అదనపు వివరాలను తొలగించేందుకు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దాదాపు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ సమాచారం ఎప్పటికప్పుడు తాజాగా, కచ్చితంగా ఉండేలా ఈ ‘క్లీన్-అప్’ కార్యక్రమాన్ని చేపట్టింది. చనిపోయిన వారి ఆధార్ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి, లేదా దాన్ని ఉపయోగించి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అనధికారికంగా పొందకుండా నివారించడానికి ఈ చర్యలు చాలా…


