బంపర్ డీల్స్! టీఆర్జీఎస్ వేదికగా పలు ఒప్పందాలు – సీఎం రేవంత్ దూకుడు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా సీఎం రేవంత్రెడ్డితో గోద్రెజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఫిరోజ్ షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్ స్వామి…


