Rohit Sharma: విశాఖలో దక్షిణాఫ్రికాతో మూడవ వన్డే.. భారీ రికార్డుకు అడుగుదూరంలో రోహిత్ శర్మ..!
విశాఖపట్నం: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. అతడు శనివారం విశాఖ వేదికగా దక్షిణాప్రికాతో జరగనున్న మూడో వన్డే మ్యాచ్లో 27 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత ప్లేయర్గా రికార్డులకు ఎక్కుతాడు.ఇప్పటివరకూ భారత్ తరపున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్లు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించారు.


