Thai Warship Sinks In Rough Seas, leaving 31 Sailors Missing

సముద్రంలో మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు

గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఓ భారీ యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 106 మందిలో 73మంది సురక్షితంగా ఉండగా, మరో 33మంది గల్లంతయ్యారు. తప్పిపోయిన మెరైన్‌లను గుర్తించడానికి థాయ్‌లాండ్ సైన్యం యుద్ధనౌకలు, హెలికాప్టర్‌లను మోహరించినట్లు నావికాదళం తెలిపింది. తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగానే రాత్రి సమయంలో బ్యాంకాక్‌కు దక్షిణంగా ఉన్న ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. 1987 నుండి వాడుకలో ఉన్న యుఎస్-నిర్మిత కొర్వెట్ అయిన సుఖోథాయ్ బలమైన అలల తాకిడికి ఒక్కసారిగా ఒక వైపుకు వంగిపోయిందని నావికాదళ ప్రతినిధి అడ్మిరల్ పోగ్‌క్రాంగ్ మాంథార్డ్‌పలిన్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను థాయ్‌ నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.