TRS MLC Kavita on Bilkis Bano

బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి: టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత

గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

అత్యాచార కేసు దోషుల విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్త్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపిస్టులకు స్వాగతం చెప్పడం సమాజానికి చెంపపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.

ఇలాంటి పరంపర సాగడం మొడలుకాక ముందే ఈ ప్రమాదపు సంప్రదాయాన్ని ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు.రేపిస్టులు, హత్య చేసిన వాళ్ళు జైలు నుంచి విడదల అయిన తర్వాత ఒక సిద్దాంతాన్ని పాటించే వాళ్ళు కొంత మంది స్వాగతం చెప్పడం సమాజానికి చెంప పెట్టు అని అన్నారు.రెమిషన్ విధానం కింద ఆగస్టు 15న 2002 నాటి బిల్కీస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలకు ఒక సంస్థకు చెందిన సంస్థకు చెందిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపిస్తూ పూలదండలతో స్వాగతం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలు చేసిన వారిని పవిత్రమైన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయడం ఆ రోజుకు ఉండే పవిత్రతకు కళంకం అని పేర్కొన్నారు.రేపిస్టులు మరియు జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని క్షమించరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ వీరి విడుదల జరిగింది అని ప్రస్తావించారు.నెలల గర్భిణీ ని రేప్ చేయడం మరియు ఆమె మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన రేపిస్టులను విడుదల చేసి గుజరాత్ లోని బిజెపి ప్రభుత్వం సున్నితత్వం లేని తనాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. ఇది చట్ట విరుద్ధమే కాకుండా మానవత్వానికి కూడా వ్యతిరేకమైన అని స్పష్టం చేశారు. ఒక మహిళగా బిల్కీస్ భాను అనుభవించిన బాధను వెదను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు.ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, పౌరులకు చట్టంపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండడానికి ఈ సిగ్గుమాలిన నిర్ణయాన్ని గుజరాత్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.