ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడెమీ ఏర్పాటు

ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకాంక్షించారు. యూనివర్శిటీల్లో విద్యార్థులకు పోటీపరీక్షల తర్ఫీదు ఇచ్చే విధంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉపకులపతుల సమావేశంలో తాను చేసిన ప్రతిపాదనను… ఉస్మానియా యూనివర్శిటీ సాకారం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల కళలలను నిజం చేసేలా చొరవ తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పలువురు సీనియర్ ఐఏఎస్ లు, ప్రొఫెసర్లతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీని ఆయన ప్రారంభించారు.