Chhattisgarh: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి: ఐజీ సుందర్రాజ్
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 9 మంది మహిళలతో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. బీజాపూర్లో డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్తో కలిసి ఎన్కౌంటర్ వివరాలను గురువారం వెల్లడించారు. ఎన్కౌంటర్ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టులు త్వరగా లొంగిపోతే మంచిదని, లేకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని…


