డిసెంబర్ కన్నా ముందే చలి.. జనజీవనం అస్తవ్యస్థం!
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలోని ఆదిలా బాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలపై చలి పంజా విసురుతోంది. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి, గ్రామీణ, గిరిజన వర్గాలను గజగజ వణికిస్తున్నాయి. డిసెంబర్ ప్రవేశించక ముందే ఈ తీవ్రత ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి వీస్తున్న చల్లని గాలుల దాడికి ఈ ప్రాంతం అతలాకుతలమవుతోంది. వాతావరణంలో ఈ అసాధారణ…


